షాకింగ్ ఘటన.. పిల్లిని పీక్కు తిన్న యువకుడు

by Disha Web Desk 8 |
షాకింగ్ ఘటన.. పిల్లిని పీక్కు తిన్న యువకుడు
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఏ చిన్న సంఘటన జరిగినా సరే క్షణాల్లో మన ముందుఉంటుంది. అయితే ఎవరైనా ఆకలి అయితే చిప్స్ లేకపోతే ఏవైనా పండ్లు తింటారు. కానీ ఓ యువకు తిండి లేక పిల్లిని పీక్కుతిన్న వింత ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అయితే అస్సాంకు చెందిన ఓ యువకుడు, తన ఫ్యామిలీకి చెప్పకుండా, కేరళకు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక తనకు డబ్బులు లేకుండా అయిపోయాయి. కనిసానికి తినడానికి కూడా అతని వద్ద మనీ లేకుండా పోయాయి. దీంతో ఆయన ఐదు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆకలి బాధను తట్టుకోలేకపోయిన ఆ యువకుడు చనిపోయిన పిల్లిని పీక్కతింటూ కనిపించాడంట. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్నవారిని దిగ్బ్రాంతికి గురిచేసింది.దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి తనకు ఆహారం పెట్టి తన వివరాలు సేకరించారు. ప్రస్తుతం యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed