కోడలికి రూ. 500 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇచ్చిన నీతా అంబానీ.. విశేషాలివే..

by Disha Web Desk 13 |
కోడలికి రూ. 500 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇచ్చిన నీతా అంబానీ.. విశేషాలివే..
X

దిశ, ఫీచర్స్: ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్న జంటలలో ఒకరు.కాగా కింగ్ సైజ్ జీవితాన్ని గడపుతున్న వీరు.. సంపన్న జీవనశైలికి అనుగుణంగా డియరెస్ట్ ఫ్రెండ్స్‌కు ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన బహుమతులు అందిస్తూ తరుచుగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటారు. కాగా తాజా నివేదిక ప్రకారం నీతా అంబానీ ఆమె కోడలు శ్లోకా మెహతాకు దాదాపు రూ. 500 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను బహుకరించినట్లు తెలుస్తోంది.

లెబనీస్ జ్యువెల్లర్ మౌవాద్ రూపొందించిన ఈ డైమండ్ నెక్లెస్‌లో 200 క్యారెట్ల మెరుపు రాళ్లతో పాటు 91 వజ్రాలు ఉన్నట్లు సమాచారం. మార్చి 8న నీతా అంబానీ-ముఖేష్ అంబానీల పెళ్లి రోజు సందర్భంగా ఈ బహుమతిని అందించారని తెలుస్తుండగా.. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ జ్యువెల్లరీ అని నివేదికలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్.. 48 గంటల ముందు ఆర్డర్ చేయాల్సిందే..


Next Story

Most Viewed