సడెన్‌గా ట్రైన్ బ్రేక్ ఎందుకు వేయరో.. వేస్తే ఏమౌతుందో తెలుసా?

by Dishanational2 |
సడెన్‌గా ట్రైన్ బ్రేక్ ఎందుకు వేయరో.. వేస్తే ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రైల్వే ట్రాక్ మీద చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కొంత మంది కావాలనే ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ట్రాక్ పైన మనుషులు ఉన్న విషయం, రైలు నడిపే వ్యక్తికి ముందే తెలుస్తుంది. కానీ అతను రైలును సడెన్‌గా ఆపడు. అయితే అలా సడెన్ బ్రేక్ వేసి ట్రైన్ ఆపక పోవడానికి కూడా కారణం ఉందంట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని బోగీలు కలిపితే రైలు అవుతుంది.. ట్రైన్‌లో ఉండే బ్రేక్ సిస్టం వాక్యూమ్ ప్రెషర్‌తో నిండి ఉండి అన్ని బోగీలుని కలిపి ట్యూబ్ ద్వారా ఉంచుతారు. లోపల పీడనం తగ్గిస్తే బ్రేక్ ఉపయోగంలోకి వస్తుంది. ఇంజన్ వేగం తగ్గి బోగీలు అదే దిశలో వేగంగా కదిలి ఒక్కదానికి మీదికి ఒకటి ఎక్కే అవకాశం ఉంటుందంట. అంతే కాకుండా బోగిలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుందంట. దీని వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందంట. అందువలన వారు సడెన్ బ్రేక్ వేయడంట. ఒక్క ప్రాణం కోసం వేలాది మంది ప్రాణాలని రిస్క్ చేయడం కుదురదు కాబట్టి సడెన్ బ్రేక్ వేసి రిస్క్ తీసుకోరంట.

Read more:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్‌ ఇళ్లు.. ఎక్కడుందో తెలుసా?



Next Story

Most Viewed