- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ajith-Pakistan Relationship: తమిళ సూపర్ స్టార్ అజిత్కు పాకిస్థాన్ కు ఉన్న లింకు తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

దిశ, వెబె డెస్క్: Ajith-Pakistan Relationship: పద్మభూషణ్ గా ఇటీవలే కీర్తి ప్రతిష్టలు అందుకున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయి అని తెలిస్తే మీరంతా ఆశ్చర్య పోవడం ఖాయం. అవును మీరు వింటున్నది నిజమే. సూపర్ స్టార్ అజిత్ కుమార్ అంటే తమిళనాడు ఎంతో ఆరాధన భావం ఉంది. ఆయనకు అక్కడ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.
రజనీకాంత్ తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులను అందుకున్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. తన వరుస హిట్లతో అజిత్ ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నారు. అయితే తమిళ సూపర్ స్టార్ అజిత్ పాకిస్తాన్ మూలాలు ఎలా కలిగి ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తల్లిదండ్రులు వేరువేరు రాష్ట్రాలకు చెందినవారు. ఆయన తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు. ఇక అజిత్ తల్లి మోహిని ఆమె పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. మీరు సింధీ కమ్యూనిటీకి చెందినవారు. వీరి కుటుంబం పాకిస్తాన్ నుంచి కలకత్తాకు వచ్చి స్థిరపడింది. అయితే అజిత్ కుమార్ మాత్రం హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు. ఈ విధంగా హీరో అజిత్ కుమార్ కు పాకిస్తాన్ కు ఒక విచిత్రమైన బంధం ఏర్పడింది.
ఇదిలా ఉంటే దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్ నుంచి అనేక మంది హిందువులు, కాందిశీకులుగా భారత్ కు తరలివచ్చారు. అలాంటి వారికి భారత ప్రభుత్వం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసి స్థిరనివాసం ఏర్పాటు చేసింది. వీరంతా నేడు భారతదేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా పాకిస్థాన్ నుంచి కాందిషీకులుగా భారత్ తరలివచ్చిన వారిలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అలాగే భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ సైతం ఉన్నారు. వీరి కుటుంబాలు పాకిస్థాన్ నుంచి భారతదేశానికి తరలివచ్చాయి.