ఆమె మీద ప్రేమతో.. రూ. 20 చికెన్ బిర్యానీ ఇస్తున్న వ్యక్తి

by Disha Web Desk 7 |
ఆమె మీద ప్రేమతో.. రూ. 20 చికెన్ బిర్యానీ ఇస్తున్న వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్, పలావ్, బిర్యానీ ఏది కావాలన్నా దాదాపుగా రూ. 100 నుంచి ఆ పైన కట్టాల్సిందే. కానీ, చికెన్ బిర్యానీ రూ. 20 ఇస్తున్నాడు ఓ వ్యక్తి. అవును మీరు విన్నది నిజమే.. కేవలం రూ.20 లకే ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఇస్తున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు.. అలా ఎందుకు చేస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామానికి చెందిన గోడి సత్యనారాయణ అనే వ్యక్తి అంజలి బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. గతంలో ఈ వ్యక్తి హైదరాబాద్‌లోని పఠాన్ చెరువు ప్రాంతంలో బిర్యానీ సెంటర్ నడిపేవాడు. కానీ, అక్కడ కొంత మంది స్థానిక వ్యాపారుల నుంచి బెదిరింపులు రావడంతో సొంతూరికి మకాం మార్చి అక్కడే బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. చికెన్, ఆయిల్ రేట్లు ఎంత పెరుగుతున్న తక్కువ ధరకే బిర్యానీ అందిస్తున్నాడు సత్యనారాయణ.

అయితే కూతురి పుట్టినరోజున తాను బిజినెస్‌లో సక్సెస్ కావడంతో.. ఆమెపై ఉన్న ప్రేమతో రూ. 20 కే బిర్యానీ అందిస్తానని దేవుడికి మాట ఇచ్చాడట. దీంతో పగలంతా బిర్యానీ రేట్ సాధారణంగానే ఉంటుంది. సాయంత్రం 6 నుంచి మాత్రం తక్కువ రేటుకే ఇస్తాడు సత్యనారాయణ. ఇక తాజాగా.. ఓ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సత్యాన్నారాయణ ఈ విషయాలన్ని చెప్పుకొస్తూ.. రాబోయే రోజుల్లో 30 రూపాయలకే భోజనం అందిస్తానని కూడా తెలిపాడు. సత్యనారాయణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. అతని మంచి మనస్సుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed