Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై వీర వనిత సోఫియా కురేషి మీడియా ప్రజెంటేషన్.. ఎవరీ గ్రేట్ సోల్జర్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-07 14:19:46  IST  )

‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి మీడియాకు వివరించేందుకు ఇద్దరు ఉమెన్ ఆఫీర్స్‌ను నియమించడం ఇండియా కమిట్మెంట్‌ను సూచిస్తుంది. పహెల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు న్యాయం చేసేందుకు ఇచ్చిన హామీని ప్రతిబింబిస్తుంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ గురించి జాతిని ఉద్దేశించి

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై వీర వనిత సోఫియా కురేషి మీడియా ప్రజెంటేషన్.. ఎవరీ గ్రేట్ సోల్జర్..
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి మీడియాకు వివరించేందుకు ఇద్దరు ఉమెన్ ఆఫీర్స్‌ను నియమించడం ఇండియా కమిట్మెంట్‌ను సూచిస్తుంది. పహెల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ప్రతిబింబిస్తుంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ గురించి జాతిని ఉద్దేశించి మాట్లాడిన కల్నల్ సోఫియా కురేషి చరిత్ర సృష్టించారు. మల్టీనేషనల్ మిలిటరీ ఎక్స‌ర్‌సైజ్‌లో భారత సైన్య బృందానికి నేతృత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసిన ఆమె.. వైమానిక దళంలోని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారతదేశం నిర్వహించిన సరిహద్దు దాడుల గురించి వివరించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత సమయంలో.. వేదికపై కల్నల్ కురేషి కామ్ అప్పియరెన్స్ కేవలం సింబాలిక్‌ మాత్రమే కాదు. దశాబ్దాల సేవలు, అంతర్జాతీయ నియామకాలు, అపూర్వమైన నాయకత్వంతో సంపాదించిన గొప్పతనం.

సైనిక కుటుంబం

సోఫియా కురేషి గుజరాత్‌కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన ఆమె.. సైనిక కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా ఉన్న సైనికుడిని వివాహం చేసుకోవడం సైనిక క్రమశిక్షణ, సేవలో ఆమె జీవితాన్ని మరింత బలపరిచింది. సోఫియా ఖురేషి 2016లో చిన్నవయసులోనే బహుళజాతి సైనిక విన్యాసాలలో ఆర్మీ బృందానికి నాయ‌క‌త్వం వ‌హించి చ‌రిత్ర సృష్టించిన మొట్టమొదటి మహిళా అధికారిణిగా నిలిచారు. ప్ర‌స్తుతం ఆమె ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ సిగ్న‌ల్స్ ఆఫీస‌ర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాల్లో ఒకటి అయిన ఎక్సర్ సైజ్ ఫోర్స్ 18లో పాల్గొన్న సోఫియా.. ఈ విన్యాసాల్లో ఇండియాతో పాటూ జపాన్,చైనా, రష్యా, అమెరికా, కొరియా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాతో పాటూ మరికొన్ని ఏషియన్ దేశాల సభ్యులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ అనుభవం

ఐక్యరాష్ట్ర సమితి (UN) శాంతి పరిరక్షణ కార్యకలాపాల (PKO)లో ఆరు సంవత్సరాలు పని చేశారు సోఫియా కురేషి. ముఖ్యంగా 2006లో కాంగోలో UN మిషన్ సమయంలో.. కాల్పుల విరమణలను పర్యవేక్షించారు. సంఘర్షణ ప్రాంతాలలో మానవతా మిషన్లకు మద్దతు ఇచ్చారు. కాగా ప్రస్తుతం భారత్‌ కోసం నిర్వర్తిస్తున్న విధులు, ఆమె నియామకం ఇతర మహిళా అధికారులను దేశం కోసం కష్టపడి పనిచేయమని, అందరినీ గర్వపడేలా చేయమని ప్రోత్సహించేందుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయి.

గుర్తింపు

కల్నల్ కురేషి ర్యాంకుల ద్వారా ఎదుగుదల ఎప్పుడూ సాంకేతికంగా చిత్రించబడలేదు. అప్పటి సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్, దివంగత జనరల్ బిపిన్ రావత్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఆమె ఎంపిక ఆమె సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాల ఆధారంగా జరిగింది. లింగం ఆధారంగా కాదు’’ అని స్పష్టం చేశారు. సోఫియా కురేషి భారత సైన్యంలో మహిళల పాత్రలో ఒక కీలకమైన మార్పును సూచిస్తుండగా.. ఆమె నాయకత్వం, అంకితభావంతో గ్రేట్ సోల్జర్‌గా సెల్యూట్ అందుకుంటున్నారు.

Click For Tweet..

Next Story