వరుడు ఒకరు.. వధువులు ఇద్దరు.. ఈ పెళ్లి స్టోరీ భలే ఉందంటున్న నెటిజన్స్

by Dishanational2 |
వరుడు ఒకరు.. వధువులు ఇద్దరు.. ఈ పెళ్లి స్టోరీ భలే ఉందంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం అంటారు. పెద్దలు మాట్లాడి ఇద్దరికీ పెళ్లి కుదుర్చుతుంటారు. పచ్చని పందిట్లో వధూవరులు పెద్దలు,బంధు మిత్రుల సమక్షంలో మూడుముళ్లతో ఒకటవుతారు.

అయితే ఎక్కడైనా పెళ్లి అంటే వరుడు, వధువు ఇద్దరే ఉంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దీంతో ఆ పెళ్లికి సంబంధించిన పత్రికలో ఇద్దరి పేర్లు కూడా వేయించడంతో ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక తెగ వైరల్ అవుతోంది.

అసలు ఏమైందంటే.. జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు, సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే సత్తిబాబుకు స్వప్నతో పెళ్లి జరిపించడానికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. దీంతో అంతకుముదే సత్తీబాబు సునీతను ప్రేమించాడు. ఈవిషయం తెలుసుకున్న సునీత సత్తిబాబును నిలదీయడంతో, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీంతో పెళ్లి పత్రికలో కూడా ఇద్దరు పేర్లు రాయడంతో ప్రస్తుతం ఈ సంఘటన తెగ వైరల్ అవుతోంది.

Next Story