అనుకున్న సమయానికే ఎల్ఐసీ ఐపీఓ: దీపమ్ కార్యదర్శి!

by  |
Thuhin kantha pandy
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓ ఆలస్యమవుతుందనే ఊహాగానాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఎల్ఐసీ ఐపీఓ సాధ్యం కాకపోవచ్చని, సంస్థ విలువ కట్టడం, డాక్యుమెంటేషన్ సహా ఇతర ప్రక్రియల కారణంగా ఆలస్యమవుతుందనే సంకేతాలు వినిపించాయి. అయితే ఇవి నిజం కాదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌(దీపమ్) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఆదివారం ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ పూర్తవుతుందని, దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధమైందని ఆయన తెలిపారు.

lic

మొదట పీటీఐ ప్రకారం.. ఎల్ఐసీ, అనుబంధ సంస్థల స్థిరాస్తులు, పరిమాణం, అది అందించే పాలసీల విలువను అంచనా వేయడంలో సంక్లిష్టతలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతే మిగిలినవి కొనసాగుతాయి. ఐపీఓకు సెబీతో పాటు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ పరిశీలన అవసరమని దీనికి మరో ఏడు నెలల సమయం పట్టొచ్చని వార్తలొచ్చాయి. అయితే, ఆ తర్వాత దీపమ్ కార్యదర్శి దీనిపై స్పష్టత ఇస్తూ ఐపీఓ అనుకున్న సమయానికే పూర్తవుతుందని చెప్పారు. కాగా, ప్రభుత్వం 2021-22 పూర్తయ్యే నాటికి మొత్తం రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను లక్ష్యంగా ఉంది. ఇందులో ఎల్ఐసీ ఐపీఓనే కీలకం. ఎల్ఐసీ సంస్థ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే రూ. 8-10 లక్షల కోట్ల విలువైన కంపెనీగా నిలవనుంది. ఎల్ఐసీ ప్రస్తుతం రూ. 32 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.



Next Story

Most Viewed