రూ. 50 కోట్ల చెక్ అందజేసిన ఎల్జీ పాలిమర్స్

by  |
రూ. 50 కోట్ల చెక్ అందజేసిన ఎల్జీ పాలిమర్స్
X

దిశ, ఏపీబ్యూరో: విశాఖపట్నం జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టిరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) స్పందిస్తూ.. తక్షణం 50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు రూ. 50 కోట్ల చెక్ అందించారు. దీనిపై కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఎన్‌జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని వినియోగిస్తామని చెప్పారు.


Next Story