పరిగిలో లేగ దూడపై చిరుత దాడి..? గజగజ వణుకుతున్న రైతులు

by  |
leopard1
X

దిశ, పరిగి/చౌడపూర్: చిరుత దాడిలో మరో లేగదూడ మృతి చెందింది. వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ చౌడపూర్ మండలం కల్మన్ కల్వ గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప తన లేగదూడలు ఎప్పటిలాగే పశువులపాకలో ఉంచి గురువారం రాత్రి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి లేగదూడ కనిపించలేదు. కొద్ది దూరంలో రక్తపు మడుగులో లేగదూడ మృతి చెంది కనిపించింది. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉండటంతో చిరుతే లేగదూడని చంపి ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించగా వివరాలు సేకరిస్తున్నారు. పశువులతో పాటు తమకు కూడా భయంగా ఉందని రైతులు అంటున్నారు.


Next Story

Most Viewed