బోథ్‌లో భయపెడుతున్న చిరుత పులి సంచారం

by  |
బోథ్‌లో భయపెడుతున్న చిరుత పులి సంచారం
X

దిశ, బోథ్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో చిరుత సంచారం స్థానికులను కంటికి కునుకు లేకుండా చేస్తుంది. రాజన్న పల్లె గ్రామ సమీపంలోని రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిరుత పులి.. మండడి వెంకటరావు అనే రైతుకు కనిపించింది. వాటర్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి సంచరించి ఆ తర్వాత మొక్కజొన్న తోటలోకి వెళ్లిపోయిందని సదరు రైతు చెబుతున్నాడు. చిరుత సంచారం వార్తలతో మండల వాసులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed