- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దీంతో స్థానికులు కంటిమీద కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు. ఆ చిరుతను పట్టుకోవడానికి గత కొంతకాలంగా ఫారెస్టు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, అది ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాజేంద్రనగర్ వాసులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
హిమాయత్సాగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం చిరుత మరోసారి ప్రత్యక్షమైంది. పశువుల కొట్టంపై దాడి చేసి తెల్లవారు జామున లేగదూడను చంపేసింది. అది గమనించిన అహ్మద్ అనే వ్యవసాయదారుడు శబ్దం చేయడంతో చిరుత పారిపోయినట్లు వివరించాడు. కాగా, మే నెలలో బుద్వెల్ వద్ద రోడ్డు పై కనిపించిన చిరుత.. 4 నెలలుగా ఎవరికీ చిక్కకుండా ఫారెస్టు అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది.
Next Story