కౌశిక్​ రెడ్డికి 'లీగల్​' షాక్

by  |
Huzurabad Bypolls
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ బహిష్కృత నేత పాడి కౌశిక్​రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ లీగల్​ నోటీసు పంపారు. మధురై కోర్టు నుంచి ఈ లీగల్​ నోటీసు జారీ అయింది. టీపీసీసీ చీఫ్​ అంశంలో రేవంత్​రెడ్డి నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఆయన నోటీసులిచ్చారు. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో రూ. కోటి నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వివరించారు.

మధురైకి రండి

ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్​ ట్విట్టర్​ వేదికగా కౌశిక్​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇష్టానుసారంగా మాట్లాడినందుకు లీగల్​ నోటీసు పంపుతున్నామని, మధురైకి తిరుగాల్సి వస్తుందని సూచించారు. ఈ సందర్భంగా మధురైకి స్వాగతం అంటూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

https://twitter.com/manickamtagore/status/1414557402339315712

Next Story

Most Viewed