మోతేలో చిరుత సంచారం?

by  |
మోతేలో చిరుత సంచారం?
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. మిరుదొడ్డి మండలం మోతే గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జంతువు అడుగు గుర్తుల ఆధారంగా హైనా అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామస్తులు భయపడొద్దని హైనాలు సంచరిస్తున్నట్లు బీట్ ఆఫీసర్ కిషోర్ తెలిపారు. అటవీ జంతువులను గుర్తుపట్టేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మిరుడొడ్డి అటవీ ప్రాంతంలో చిరుతలు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు తమ పశువులను రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి తెచ్చుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed