సీఎం, హోంమంత్రి స్పందించాలి !

by  |
సీఎం, హోంమంత్రి స్పందించాలి !
X

దిశ, క్రైమ్‌బ్యూరో: యువతిపై అత్యాచారానికి పాల్పడిన 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఎరుకల సంఘం నాయకులు కుమార్, కండెల వెంకటేశ్వర్లు మాట్లాడారు. పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసి 10 రోజులు అవుతున్నా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ అండదండలు కలిగిన వారు నిందితులుగా ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed