అప్యాయంగా అన్నం పెట్టి… ఆదరించేది

by  |
అప్యాయంగా అన్నం పెట్టి… ఆదరించేది
X

దిశ, సూర్యాపేట: భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు లచ్చయ్య (సీఎల్) సతీమణి కామ్రేడ్ విజయలక్ష్మి చనిపోవడం ఎంతో బాధాకరమని పార్టీ నాయకులు దొరెపల్లి శంకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం భవనంలో విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…

తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి విజయలక్ష్మి భర్తతో పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి నడిచిందన్నారు. భర్తతో పాటు ఆమె రజాకార్లను ఎదిరించి పోరాడిన వీరవనిత అని కొనియాడారు. సీఎల్ వ్యాపారంలోకి వచ్చాక చుట్టుపక్కల గ్రామాల నుంచి మార్కెట్‌కు వచ్చిన ఆసాములకు, షావుకారులకు ఆమె ఎంతో అభిమానంతో ఆప్యాయతతో అన్నం పెట్టి ఆదరించేదని, అలాంటి వీర వనిత చనిపోవడం చాలా బాధాకరం అన్నారు.


Next Story

Most Viewed