- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట: భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు లచ్చయ్య (సీఎల్) సతీమణి కామ్రేడ్ విజయలక్ష్మి చనిపోవడం ఎంతో బాధాకరమని పార్టీ నాయకులు దొరెపల్లి శంకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం భవనంలో విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి విజయలక్ష్మి భర్తతో పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి నడిచిందన్నారు. భర్తతో పాటు ఆమె రజాకార్లను ఎదిరించి పోరాడిన వీరవనిత అని కొనియాడారు. సీఎల్ వ్యాపారంలోకి వచ్చాక చుట్టుపక్కల గ్రామాల నుంచి మార్కెట్కు వచ్చిన ఆసాములకు, షావుకారులకు ఆమె ఎంతో అభిమానంతో ఆప్యాయతతో అన్నం పెట్టి ఆదరించేదని, అలాంటి వీర వనిత చనిపోవడం చాలా బాధాకరం అన్నారు.
Next Story