- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics: ఎన్నికలపై వివేకా హత్య ప్రభావం చూపనుందా..?
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది.
వైఎస్ వేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లు గడుస్తోంది. అయినా నేటికి ఆ కేసు కొల్లిక్కి రాలేదు. దీనితో సొంత చిన్నాన్న అతి దారుణంగా హత్యకు గురైతే నిందితులను ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి కూడా ఎందుకు పట్టుకోలేదని, అటు సొంత చెల్లెలు ఇటు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వివేకా హత్య కేసు గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజల్లోనూ అదే ప్రశ్న రేకత్తుతోంది. సొంత చిన్నాన్న అతి దారుణంగా హత్యకు గురైతే అధికారంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు హంతకులని పట్టుకోలేకపోయారు? అనే ప్రశ్న ప్రజల్లో రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందా అనే ప్రశ్న రాజకీయంగా ఆశక్తి రేపుతోంది.