అధికారుల తీరుతో తలెత్తుకోలేక పోతున్నాం: ప్రజాప్రతినిధులు

by  |
అధికారుల తీరుతో తలెత్తుకోలేక పోతున్నాం: ప్రజాప్రతినిధులు
X

దిశ, ఇందల్వాయి: మండల కేంద్రంలో ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీపీ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారులపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో గ్రామాల్లో తలెత్తుకోలేక పోతున్నామన్నారు. గ్రామాలలో హరితహారం, గ్రామ పార్కుల కోసం కనీస నిధులు కూడా ఇవ్వలేదని మల్లాపూర్ సర్పంచ్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయగా అధికారుల వద్ద సమాధానం లేదు. దీంతో మెజార్టీ సభ్యులు మండల సమావేశాన్ని అర్దాంతరంగా బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. బాయ్‌కాట్ చేసిన వారిలో ఎంపీటీసీలు సుధాకర్, దాసు, బాబురావు, అశ్వినీ శ్రీనివాస్, పరశురాముడు, గణేష్, రవి, అంజయ్య తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed