మీరు ఒక్కటైతే బీజేపీదే అధికారం.. ఓబీసీలకు లక్ష్మణ్ పిలుపు

by  |
మీరు ఒక్కటైతే బీజేపీదే అధికారం.. ఓబీసీలకు లక్ష్మణ్ పిలుపు
X

దిశ, కంటోన్మెంట్: దేశ జనాభాలో సగం మంది ఉన్న ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కంటోన్మెంట్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో సామాజిక, విద్య, ఉద్యోగ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే ఉద్యోగ విద్య అవకాశాలు మెరుగుపడతాయని అనుకున్నప్పటికీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేస్తూ వంచనకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ఓబీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తూ వారి అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఓబీసీలు ఐక్యతను చాటితే 2023 లో బీజేపీకి అధికారం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత, ఆలేరు భాస్కర్, మల్లేష్, శ్యామ్ సుందర్ గౌడ్, ఆకుల నగేష్, భాస్కర్, శైలేంద్ర, వెంకట చారి, ఓం ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story