సీఎం కేసీఆర్ ఫొటోకు న్యాయవాదుల క్షీరాభిషేకం

by  |
సీఎం కేసీఆర్ ఫొటోకు న్యాయవాదుల క్షీరాభిషేకం
X

దిశ, నిజామాబాద్:
కరోనా సహాయార్థం జూనియర్ న్యాయవాదులకు సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు విడుదల చేయడాన్ని న్యాయవాదులు హర్షించారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీపీ మధుసూదన్ రావు న్యాయవాదులు శాస్త్రి , కిరణ్ కుమార్ గౌడ్, ఆశ నారాయణ, రవి రాజ్, రాజశేఖర్ రెడ్డి, వసంత్, లింగన్న, జైపాల్ ఎండల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story