ఏపీలో మెల్లిగా పెరుగుతున్న కరోనా మరణాలు..

by  |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. మెున్నటితో పోల్చుకుంటే కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 43,594 సాంపుల్ పరీక్షించగా 739మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,22,064కి చేరింది. అదే సమయంలో కరోనాతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 13,925కు పెరిగింది. గత 24 గంటల్లో 1,333మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,93, 589కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69, 82,681సాంపుల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed