ఆడపిల్ల పుట్టిందని అంబారీపై ఊరేగింపు

by Shiva |
ఆడపిల్ల పుట్టిందని అంబారీపై ఊరేగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందనే ఆనందంతో ఏనుగుపై ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పచ్‌గావ్‌లో నివసించే గిరీశ్‌ పాటిల్‌ దంపతులకు గత ఐదు నెలల క్రితం పండంటి అమ్మాయి పుట్టింది. ఆ చిన్నారిని శనివారం తన ఇంటికి తీసుకురాగా, గిరీశ్ ఆమెకు ఘనంగా స్వాగత ఏర్పాట్లను చేశాడు. ఏనుగుపై ఊరేగిస్తూ మేళ, తాళాల నడుమ తన స్వగృహానికి తీసుకువెళ్లాడు. తమ వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని గిరీశ్ ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed