సిద్ధిపేటలో 2 నిమిషాల మౌనం

by  |
సిద్ధిపేటలో 2 నిమిషాల మౌనం
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా ప్రజా పరిషత్ లో సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధ కృష్ణశర్మ, వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ బెజ్జంకి కనగండ్ల కవిత తిరుపతి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డికి, మాజీ ఎంపీ నంది ఎల్లయ్యకు వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సంతాపం తెలిపి 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రావణ్ కుమార్, కమిటీ జెడ్పీటీసీలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed