సంగారెడ్డిలో సన్మానం.. ఎవరికీ ?

by  |
సంగారెడ్డిలో సన్మానం.. ఎవరికీ ?
X

దిశ, సంగారెడ్డి: ఎంతో విశేషమైన అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రామమందిరంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం 1992 వ సంవత్సరం డిసెంబర్ 6న, కళ్యాణ్ సింగ్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు అయోధ్యలో జరిగిన కరసేవ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి అయోధ్యకు వెళ్లి కరసేవలో పాల్గొన్న కరసేవకులకు శాలువాలతో సన్మానించి శ్రీరాముని చిత్రపటాన్ని అందించి సత్కరించారు. మిఠాయిలను పంచి అంబరాన్నంటే విధంగా సంబరాలను జరుపుకున్నారు.

Next Story

Most Viewed