బాధాకరం.. కనిపించని మానవత్వం

by  |
బాధాకరం.. కనిపించని మానవత్వం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.. అనే పాటకు ఈ ఘటనకు నిదర్శనం. కరోనాతో ఓ వృద్ధురాలు చనిపోయింది. కానీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. తన తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలి అంటూ ఆవేదన చెందుతూ మీడియా ముందుకు వచ్చాడు కుమారుడు.

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్దెమర్రి గ్రామంలో యాంజాల లక్ష్మీ అనే వృద్ధురాలు మృతిచెందింది. ఈరోజు ఉదయం మరణించిన ఆ వృద్ధురాలు అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కుమారుడు మీన్ రెడ్డి ఆవేదన చెందుతూ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అతను మీడియా ముందుకొచ్చిన ప్రభుత్వం స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed