వధువులిద్దరు.. వరుడొక్కడే.. పెళ్లి కానిచ్చారు

by  |
వధువులిద్దరు.. వరుడొక్కడే.. పెళ్లి కానిచ్చారు
X

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఒకేసారి ఇద్దరి యువతులను పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో ఈనెల 8న సందీప్ ఉకే అనే యువకుడు ఓ పెళ్లి చేసుకున్నాడు. అయితే అందులో వింతేమిటంటే.. ఆ యువకుడు ఒకేసారి.. ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమం పెద్దల సమక్షంలో జరిగింది. విషయమేమంటే.. సందీప్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అయితే అతని తల్లిదండ్రులు మరో యువతితో అతడి పెళ్లి సంబంధం కుదిర్చారు. ప్రేమించిన యువతి తననే చేసుకోవాలని పట్టుబట్టింది. ఈ వ్యవహారమంతా రచ్చబండకెక్కింది. దీంతో ఆ గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి మాట్లాడారు. ఈ సమయంలో ఆ ఇద్దరు యువతులు అతడితో కలిసి ఉంటామని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. సందీప్ కూడా అందుకు ఓకే చెప్పాడు. దీంతో అతను ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. మూడు కుటుంబాల వారు ఈ పెళ్లి వేడుకకు హాజరై వధువులను, వరుడిని ఆశీర్వదించారు.



Next Story

Most Viewed