కలిసి పనిచేద్దామని భట్టి చెప్తుండు

by  |
కలిసి పనిచేద్దామని భట్టి చెప్తుండు
X

దిశ, మధిర: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు మధిర పట్టణాన్ని శానిటైజర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ట్రాక్టర్ ద్వారా పట్టణంలోని వీధులన్నీ ప్రత్యేకంగా హైపో క్లోరైడ్ ద్వారా పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లాది వాసు, రంగా హనుమంతరావు, మిర్యాల రమణ గుప్తా చావా వేణు, కోనా ధని కుమార్, దారా బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Next Story