'బయటకు రాకుండా పుస్తకాలు చదువుకోవాలి'

by  |

దిశ కోదాడ: విద్యార్థుల చదువుల పట్ల ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి పాఠశాల పునఃప్రారంభంపై చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. విద్యార్థులు బయటకు రాకుండా పుస్తకాలు చదువుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఎంపీపీ చింతా కవిత రాధా రెడ్డి, జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు, పాఠశాల హెచ్ఎం పి .కృష్ణయ్య, వైస్ ఎంపీపీ మల్లెల రాణి, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్ రమా నిరంజన్, విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లింగయ్య నరసింహారావు. తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed