సుందిళ్లలో చేపల కనువిందు

by  |
సుందిళ్లలో చేపల కనువిందు
X

దిశ, కరీంనగర్: నీటి నిల్వతో కళకళాడాల్సిన ఆ బ్యారేజీ ఇప్పుడు జనంతో కిటకిటలాడుతోంది. జల జాతరకు బదులు అక్కడ జనజాతర సాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజ్ నీటిని దిగువకు వదలడంతో క్వింటాళ్లలో చేపలు దొరుకుతున్నాయి. దీంతో సుందిళ్ల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చేపలు పట్టుకెళ్తున్నారు. ఇక్కడ మెరిగే, రవులు, అలుగు, జెల్లెలు లభ్యం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున చేపలు కనిపిస్తుండడంతో కనువిందు చేస్తున్నాయి. దీంతో సుందిళ్ల బ్యారేజీ ప్రాంతంలో చేపలు వేటాడే వారితో కిటకిటలాడుతోంది.

Next Story

Most Viewed