రాష్ట్రంలో పెరిగిన కొత్త కేసులు.. ఇవాళ ఎన్నంటే ?

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా మరో 313 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,58,689కు చేరుకోగా, డిశ్చార్జ్ ల సంఖ్య 6,49,002 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 77 తేలగా, భద్రాద్రి కొత్తగూడెంలో 5 ,జగిత్యాలలో 12 , జనగామ 6, భూపాలపల్లిలో 2, గద్వాల 2, కామారెడ్డిలో 21 , ఖమ్మంలో 14, ఆసిఫాబాద్ లో 2, మహబూబ్ నగర్ లో 4, మహబూబాబాద్ లో 8, మంచిర్యాల 7, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 18 , ములుగు లో 2, నాగర్ కర్నూల్ లో 3, నల్లగొండ 16, నిర్మల్ లో 4,నిజామాబాద్ లో 3, పెద్దపల్లిలో 16, రాజన్న సిరిసిల్లాలో 12,రంగారెడ్డిలో 13,సంగారెడ్డిలో 5,సిద్దిపేట్ లో 6, సూర్యాపేట్ లో 8, వికారాబాద్ లో 2, వనపర్తిలో 3,వరంగల్ రూరల్ లో 6, వరంగల్ అర్బన్ లో 28, యాదాద్రి భువనగిరిలో మరో 6 కేసులు చొప్పున తేలాయి. దీంతో ప్రస్తుతం ఆక్టీవ్ కేసుల సంఖ్య 5,809 చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed