తెలంగాణలో మరో 28 మందికి వైరస్

by  |
తెలంగాణలో మరో 28 మందికి వైరస్
X

తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 28 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 531కు చేరింది. తాజాగా మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 16కు పెరిగింది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు ఏడుగురి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Tags: carona, positive case, 531, telangana

Next Story