4వేల మార్క్ దాటిన కేసులు

by  |
4వేల మార్క్ దాటిన కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేల మార్కు దాటింది. కొత్తగా రాష్ట్రంలో 191 కేసులు నమోదవ్వగా.. ఎనిమిది మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,111కు చేరుకోగా… మృతుల సంఖ్య 156కి చేరింది. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం జీహెచ్ఎంసీలో 143, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో 3, నాగర్ కర్నూల్, కరీంనగర్‌లో రెండు, నిజాబాద్, వికారాబాద్, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,138 మంది చికిత్స తీసుకుంటుండగా.. 1,817 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Next Story