బ్రేకింగ్.. పట్టాలు తప్పిన ముంబై ఎక్స్‌ప్రెస్

by  |
Train
X

దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాల కారణంగా జన జీవనం, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గోవాలోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటకలోని మంగళూరు నుంచి బయలుదేరిన.. మంగుళూరు – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు.. సోనాలిమ్, దూద్​సాగర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story

Most Viewed