టార్గెట్ మిస్ ఫైర్..

by  |
టార్గెట్ మిస్ ఫైర్..
X

దిశ, భద్రాచలం : పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళ వారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…బీజాపూర్ లోని బాసగూడ-తారెం ప్రాంతంలోని రాజు పేట సమీపంలో భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మందు పాతర అమర్చారు. కాగా మందుపాతర పైనుంచి మంగళవారం ఓ సుమో వెళ్లింది. దీంతో భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో మహ్మద్ ఇక్బాల్, బల్‌రామ్ ప్రధాన్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed