బిగ్ బ్రేకింగ్ : కూకట్‌పల్లి ఏటీఎం నిందితులు చిక్కారు..

by Batti.Sumithra |   (  Updated:2021-04-29 11:23:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎమ్ చోరీ, సెక్యూరిటీ పర్సన్ మర్డర్ కేసులో నిందితులు ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఉదయం దొంగతనం జరగగా, 24 గంటలు గడువక ముందే నిందితులను సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. దొంగతనం సమయంలో సెక్యూరిటీ పర్సన్, మరో వ్యక్తిపై కాల్పులు జరపగా ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఈ క్రిమినల్ ముఠా నాందేడ్ పారిపోతుండగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. [&hellip;]</p>

బిగ్ బ్రేకింగ్ : కూకట్‌పల్లి ఏటీఎం నిందితులు చిక్కారు..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎమ్ చోరీ, సెక్యూరిటీ పర్సన్ మర్డర్ కేసులో నిందితులు ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఉదయం దొంగతనం జరగగా, 24 గంటలు గడువక ముందే నిందితులను సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. దొంగతనం సమయంలో సెక్యూరిటీ పర్సన్, మరో వ్యక్తిపై కాల్పులు జరపగా ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఈ క్రిమినల్ ముఠా నాందేడ్ పారిపోతుండగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

Next Story