ఆ ఉద్దేశంతోనే ఇది చేస్తున్రు: కేటీఆర్

by  |
ఆ ఉద్దేశంతోనే ఇది చేస్తున్రు: కేటీఆర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణనాన్ని అందించాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం దుండిగల్‌లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీ మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరితహారం ఒకటన్నారు. రాష్ట్రంలో మొక్కలను నాటి పచ్చదనం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రస్తుతమున్న 24శాతం పచ్చదనాన్ని 33శాతానికి పెంచేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీనరావు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed