బీజేపీ కార్పోరేటర్లపై KTR సీరియస్.. గాడ్సే భక్తులంటూ కామెంట్స్

by  |
బీజేపీ కార్పోరేటర్లపై KTR సీరియస్.. గాడ్సే భక్తులంటూ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు తీర్చేందుకు ఫండ్స్ రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన విషయంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు.

ఆయన ట్వీట్ ప్రకారం.. హైదరాబాద్‌లో బీజేపీకి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దారుణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గాడ్సే భక్తులు.. గాంధేయవాదులుగా.. గాంధీ పద్ధతిలో ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు.


Next Story

Most Viewed