- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు తీర్చేందుకు ఫండ్స్ రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన విషయంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు.
ఆయన ట్వీట్ ప్రకారం.. హైదరాబాద్లో బీజేపీకి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దారుణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గాడ్సే భక్తులు.. గాంధేయవాదులుగా.. గాంధీ పద్ధతిలో ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ట్విట్టర్ వేదికగా కోరారు.
Some thugs & hooligans of BJP in Hyderabad have vandalised the GHMC office yesterday. I strongly condemn this atrocious behaviour
Guess it’s too much to ask Godse Bhakts to behave in a Gandhian manner
Request @CPHydCity to take strictest action on the vandals as per law pic.twitter.com/0Ogg0IzLZS
— KTR (@KTRTRS) November 24, 2021