తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ

by  |
తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణాబోర్డు తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసింది. కృష్ణానదిపై నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపాలని తెలిపింది. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఏపీకి అన్యాయం జరిగే విధంగా తెలంగాణ కొత్తగా 8ప్రాజెక్టులను నిర్మిస్తుందని, వాటిని వెంటనే ఆపాలని లేఖలో స్పష్టం చేసింది. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లు ఇవ్వలేదని, అపెక్స్​ కౌన్సిల్​ అనుమతి లేదని, ఈ కొత్త ప్రాజెక్టులతో 150.53 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంటారని, దీంతో కృష్ణా జలాలపై ఆధారపడిన ఏపీలోని ప్రాంతాలను తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో అధికారులు వివరించారు.


Next Story