ఓర్లీన్స్ మాస్టర్స్ ఫైనల్‌లో క్రిష్ణ, విష్ణు జోడి

by  |
ఓర్లీన్స్ మాస్టర్స్ ఫైనల్‌లో క్రిష్ణ, విష్ణు జోడి
X

దిశ, స్పోర్ట్స్ : పారీస్‌లో జరుగుతున్న ఓర్లీన్స్ మాస్టర్స్ 2021 టోర్నమెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్‌లో క్రిష్ణ ప్రసాద్ గరగ, విష్ణు వర్దన్ గౌడ్ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం ఇంగ్లాండ్‌కు చెందిన కల్లమ్ హెమ్మింగ్, స్టీవెన్ స్టాల్‌వుడ్‎తో జరిగిన సెమీఫైనల్‌లో 21-17, 21-17 తేడాతో విజయం సాధించారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ సెమీస్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన భారత జోడి తొలి సారి సూపర్ 100 ఫైనల్‌కు చేరుకున్నారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌లో ఓడిపోయింది. డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టఫర్‌సేన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17-21, 17-21 తేడాతో ఓడిపోయింది. ఇక మహిళల జోడి అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి సెమీస్‌లో జోంగ్‌కొల్ఫన్, రావింద జోడీపై 18-21, 9-21 తేడాతో ఓడిపోయారు. భారత జట్టు ఆశలన్నీ పురుష జోడీ క్రిష్ణ, విష్ణుపైనే ఉన్నాయి. భారత నెంబర్ 1 డబుల్స్ ర్యాంకర్ అయిన క్రిష్ణ జూనియర్ స్థాయిలో సాత్వీక్ సాయిరాజ్‌తోకలసి ఆడేవాడు. ఆ తర్వాత ధృవ్ కపిలతో నవంబర్ 2016లో జట్టు కట్టాడు. అయితే 2019 నుంచి విష్ణుతో కలసి డబుల్స్ ఆడుతున్నాడు.

Next Story

Most Viewed