వర్షాల వల్ల ఆ విమానాశ్రయం మూసివేత

by  |
వర్షాల వల్ల ఆ విమానాశ్రయం మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున విమానాశ్రయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కోచి విమానాశ్రయానికి మళ్లించినట్లు సమాచారం.

కాగా, ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయి నుంచి తీసుకొస్తున్న ఏయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురై సుమారు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed