- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పులు మహేశ్ రెడ్డి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకే చెక్కును అందజేసి.. ఫోటోకు ఫోజులు ఇచ్చారు. సభలు, సమావేశాలు పెట్ట వద్దని ప్రభుత్వమే జీవో తీసుకువస్తే ఆ జీఓను ఎమ్మెల్యేలు పాటించకుంటే ఇక సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారంటూ తప్పుపట్టారు.
దోమ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లాకౌడౌన్లో మీటింగ్ పెట్టడమే కాకుండా 75 మందికిపైగా జనాలను ఒకే దగ్గరకు పిలిచి చెక్కులు పంపిణీ చేశారంటూ ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం చెక్కుతీసుకున్న వారిలో ఓ మహిళకు పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తోంది. సదరు మహిళ తోటి మహిళలతో కలిసి ఉండటం, మాట్లాడటం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తప్పుపట్టారు.
ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించాల్సిన ఎమ్మెల్యేనే ఇలా ప్రవర్థించడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. పాలకులు జీవోలను పాటించకున్నా.. కనీసం అధికారులైనా పాటించి ఉంటే ఈ సమావేశం జరిగి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు.