కరీంనగర్‌పై కొప్పుల ఈశ్వర్ ఫోకస్.. గెలుపే టార్గెట్‌ అంటూ కామెంట్స్

by  |
కరీంనగర్‌పై కొప్పుల ఈశ్వర్ ఫోకస్.. గెలుపే టార్గెట్‌ అంటూ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాలని అందుకు ప్రతీ ఓటర్‌తో భేటీ కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు మంత్రితో భేటీ అయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు.

ప్రతిపక్ష పార్టీలకు ఒక్క ఓటు కూడా పడకుండా చూడాలని, రెండు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సభ్యులకు.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, నిధుల కేటాయింపు అంశాలను మరోసారి వివరించాలని అన్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డిని అభినందించారు.


Next Story

Most Viewed