రోశయ్య లేని లోటు తీర్చలేనిది : మంత్రి కొప్పుల ఈశ్వర్

by  |
రోశయ్య లేని లోటు తీర్చలేనిది : మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య.. ముఖ్యమంత్రిగా, మంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులు చేపట్టి బాధ్యతగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. మంచి మాట కారి అయిన ఆయన, తనదైన వ్యంగమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారని అన్నారు. సుదీర్ఘంగా వ్యక్తిగత, రాజకీయ, సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. వారు లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

ఆదివారం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

Next Story

Most Viewed