బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోం.. దెబ్బకు దెబ్బ తీస్తాం: కోమటిరెడ్డి

by  |
బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోం.. దెబ్బకు దెబ్బ తీస్తాం: కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌కు వస్తున్న మద్దతును చూడలేకనే అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పక్క జిల్లాల నుంచి వచ్చి బెదిరింపులకు పాల్పడితే దెబ్బకు దెబ్బ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. జానారెడ్డి గెలుపు ఖాయం అవుతోందని.. అందుకే ఆ విషయాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఓటమి భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెట్టేందుకు డబ్బుల మూటలతో దిగుతున్నారని ఆరోపించారు.



Next Story

Most Viewed