రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు యత్నిస్తున్నారు: కోమటి రెడ్డి

by  |
రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు యత్నిస్తున్నారు: కోమటి రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత సరికాదని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రైతునని చెప్పుకునే కేసీఆర్‌కు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతుల కోసం ఖర్చు చేసిన రూ.7,500 కోట్లు సర్కార్‌కు నష్టమా అన్ని అడిగారు. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్…ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed