బౌలింగ్ ఎంచుకున్న రైడర్స్

by  |
బౌలింగ్ ఎంచుకున్న రైడర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్‌ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 16 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ ఇరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ జట్టును పరిశీలిస్తే.. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ధావన్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ఆల్‌రౌండర్ రూపంలో స్టోయినిస్, అక్షర్ పటేల్‌ చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇక కోల్‌కతాలో సునీల్ నరైన్, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీస్తోంది. యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్, ఇయాన్ మోర్గాన్ గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడం కలిసొచ్చే అంశం. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.



Next Story

Most Viewed