ఎల్ఆర్ఎస్‎తో ప్రజలను వేధిస్తున్నారు

by Shyam |   (  Updated:2020-10-10 04:09:07  IST  )

<p>దిశ ప్రతినిధి, వరంగల్: డబ్బులు లేని సమయంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శించారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో ఆస్తులకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఆస్తుల‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ గందరగోళంగా మారిందని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. ఉన్న ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారని విమర్శించారు. తెలంగాణ [&hellip;]</p>

ఎల్ఆర్ఎస్‎తో ప్రజలను వేధిస్తున్నారు
X

దిశ ప్రతినిధి, వరంగల్: డబ్బులు లేని సమయంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శించారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో ఆస్తులకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఆస్తుల‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ గందరగోళంగా మారిందని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. ఉన్న ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసిందని.. అమరుల త్యాగాలను కాపాడుకునేందుకు టీజేఎస్ ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్‎కు మద్దతు ఇవ్వాలని కోరారు.

Next Story