ఉద్యోగులను కట్టుబానిసలుగా కేసీఆర్ పాలన : కోదండరాం

by  |
Professor Kodandaram
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు రెండు భిన్న రాజకీయ దృక్పథాల మధ్య ఘర్షణలకు వేదికైందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఒక వైపు సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగుతోందని..మరో వైపు సమిష్టి ప్రయోజనాల ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాటం జరుగుతోందన్నారు. ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తూ కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. హక్కులకు కోసం ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed