ఉంటే ప్రగతి భవన్ లో.. లేదంటే ఫాం హౌస్ ‌లో..

by  |
ఉంటే ప్రగతి భవన్ లో.. లేదంటే ఫాం హౌస్ ‌లో..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మునిగి పోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారో తెలపాలని అన్నారు. హైదరాబాద్ కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. హైదరాబాద్ కు నీళ్లేందుకు ఇవ్వలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫాం హౌస్ లో ఉంటారని తెలిపారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలను పరామర్శించే సమయం కేసీఆర్ కు లేదా అని ఆయన ప్రశ్నించారు. వర్షాలు వస్తే నగరంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతాయని ఆయన అన్నారు.



Next Story