భర్తను వదిలి ఉండటం కష్టమే.. కానీ విడిపోతున్నా : కీర్తి

by  |
భర్తను వదిలి ఉండటం కష్టమే.. కానీ విడిపోతున్నా : కీర్తి
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ కీర్తి కుల్హరి.. తన హస్బెండ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని ఈ రోజు(ఏప్రిల్ 1)న ప్రకటించడమే అనుమానాలకు తావిస్తోంది. ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం చేసిన ప్రకటన కాదు కదా! అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కీర్తి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ చూస్తే.. తను నిజంగానే భర్త నుంచి సెపరేట్ అవుతున్నట్లు అనిపిస్తోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది కీర్తి.

తాను, తన భర్త సాహిల్ సెపరేట్ అవాలని నిర్ణయించుకున్నామని, అయితే అది రాతపూర్వకంగా కాదని, మ్యూచువల్ అండర్ స్టాండింగ్ అని చెప్పింది. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టమని, ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని, కానీ విడిపోవడాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయబోరని తెలిపింది. ప్రస్తుం తను ఓ గుడ్ ప్లేస్‌లో ఉన్నానని, దీని గురించి ఎవరూ కామెంట్ చేయొద్దు! అని ఎమోజీ జతచేసి ఇన్‌స్టా వేదికగా కీర్తి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.

ఇక 2016 జూన్‌లో సాహిల్‌ను వివాహమాడిన కీర్తి కుల్హరి.. ‘పింక్‌, ఇందు సర్కార్‌, బ్లాక్‌మెయిల్‌, ఉరి : ద సర్జికల్‌ స్ట్రైక్‌, మిషన్‌ మంగళ్‌’ సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన పరిణీతి చోప్రా ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’లోనూ కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘క్రిమినల్‌ జస్టిస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది.



Next Story